Sunday, April 28, 2024

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన రాకేష్.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

హనుమకొండ : రాకేష్ మరణానికి కారణమైన కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతార‌ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఎంజీఎం మార్చురీలో రాకేష్ మృతదేహానికి ఆయ‌న‌ నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణించాడం తీవ్ర విచారకర‌మ‌న్నారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తార‌న్నారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం జ‌రిగింద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యాడ‌ని మండిప‌డ్డారు. తెలంగాణ బిడ్డలను ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. రాకేష్ మరణం ముమ్మటికి బీజేపీ కేంద్ర ప్రభుత్వా వైఫల్యమే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement