Sunday, May 5, 2024

ఘ‌నంగా ఎమ్మెల్సీ క‌విత జ‌న్మ‌దిన వేడుక‌లు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్బంగా వరంగల్ లోని కాశిబుగ్గలో వరంగల్ తూర్పు జాగృతి ఇన్ ఛార్జ్ పెండ్యాల సోనిబాబు, మర్రి చందర్ ఆద్వర్యంలో జన్మదిన వేడుకలను జరిపారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై కేక్ కట్ చేసారు. వృద్దులకు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కల్వకుంట్ల కవిత కు దక్కుతుందన్నారు. విదేశాల్లో జాగృతి అనుబంధ‌ శాఖలు ఏర్పాటు చేసి తెలంగాణా ఉద్యమ ఆవశ్యకతను, బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసారన్నారు. మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న కవితక్కకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, ఎండి పుర్కాన్, వస్కుల బాబు, గందె కల్పన నవీన్, జాగృతి రాష్ట్ర ఉపాధ్య‌కులు కొరబోయిన విజయ్ కుమార్, జాగృతి జిల్లా అధ్య‌క్షులు యార బాలకృష్ణ, సుశీల్ గౌడ్, వేముల నాగరాజు, గనిపక సుదాకర్, 20వ డివిజన్ అధ్య‌క్షుడు ఇక్బాల్, ఈటల ఉమెందర్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుంకరి బాగ్యలక్ష్మి, కళావతి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement