Monday, April 29, 2024

నెల్లికుదురు జడ్పీటీసీ పై కేసు నమోదు

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు అధికార పార్టీకి చెందిన జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మానుయేల్ ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 447 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు తెలిసింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ భూములు ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న సంఘటనతో కేసు నమోదై అరెస్టు కావడం జిల్లాలో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement