Sunday, April 28, 2024

పేరాలసిస్ పేషెంట్ చికిత్సకు మంత్రి వేముల భరోసా.. రూ.2లక్షల ఎల్ఓసీ అందజేత

వేల్పూర్, ఆగస్టు 5 (ప్రభ న్యూస్) : వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కె.మల్లారెడ్డి పేరాలసిస్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స కోసం రూ.2లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి ఎల్ఓసీ కాపీని వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ మంత్రి నివాసంలో శనివారం అందజేశారు. నిరుపేదలమైన తమకు మెరుగైన వైద్య చికిత్స కోసం 2లక్షల రూపాయల ఎల్ఓసీ మంత్రి మంజూరు చేశారని, మంత్రి ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమన్నారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement