Sunday, May 5, 2024

Hanmakonda : బస్సు, లారీ ఢీ.. పలువురికి తీవ్రగాయాలు

హన్మకొండ జిల్లా ఓగ్లాపూర్ సమీపంలో పరకాల నుంచి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ భద్రయ్య కాపాడాలంటూ అర్ధనారాలు పెట్టుతుండగా పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.

ములుగు – హన్మకొండ ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల పొడవునా రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ జాం ను, వాహనాలను క్లియర్ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement