Sunday, May 12, 2024

టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

వర్దన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ మామునూర్ బీజేపీకి చెందిన ఖిలా వరంగల్ సొసైటీ డైరెక్టర్ నోముల షణ్ముఖ రెడ్డి సహా సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాలని నాయకులకు సూచించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement