Monday, April 29, 2024

WGL: లారీని ఢీకొన్న బైక్… ఇద్దరు మృతి

లారానీ బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన విషాద తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం జిల్లాలోని రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచక్రవాహనం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement