Monday, May 6, 2024

అత్యాచార యత్నం కేసు.. మూడేళ్లు జైలు

భూపాలపల్లి(ప్రభ న్యూస్) : అత్యాచార యత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు , 20వేల జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి స్పెషల్ పోక్సో కోర్ట్ జడ్జ్ పి. నారాయణ బాబు తీర్పు వెలువరించారు. భూపాలపల్లి మండలంలోని ఓ గ్రామంలో 2019 అక్టోబర్ 11న (7) ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారయత్నం చేయగా తల్లిదండ్రులు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై అభినవ్ కేసు నమోదు చేసి, విచారణ జరిపి, కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లా స్పెషల్ పోక్సో కోర్ట్ న్యాయమూర్తి పి.నారాయణ బాబు తీర్పు వెలువరించారు. ఈ కేసులో సమర్థవంతమైన వాదనలు వినిపించిన పిపి శివరాజు, కోర్టు నందు విచారణ సరిగ్గా జరగడానికి, సాక్షులను సమయానికి కోర్టులో హాజరు పరిచే విషయంలో, సాక్షులను సరిగ్గా బ్రీఫ్ చేసి, సాక్ష్యం చెప్పేలా చేసిన భూపాలపల్లి సిఐ రాం నరసింహారెడ్డి, సాక్షులను కోర్టు నందు హాజరుపరిచిన కోర్టు కానిస్టేబుల్ కల్యాణి, హోంగార్డు శంకర్ లను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement