Wednesday, May 15, 2024

Exclusive | ములుగు జిల్లాలో దారుణం.. వ‌ర‌ద‌ల‌తో హైవేకు గండి!

గోవిందరావుపేట (ప్రభ న్యూస్) : ములుగు జిల్లాలో కురుస్తున్న వానలకు రోడ్లపై వరద పారుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి వరదకు కోతకు గురైంది. హైవేకు గండిపడింది. దీంతో తాడ్వాయి ,ఏటూరు నాగారం వెళ్లేందుకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అలాగే పస్రాలోని అభ్యుదయ కాలనీ దగ్గర రహదారి కోతకు గురైంది. దానితో పాటు దయ్యాల వాగు సమీపంలోని ఎస్సీ కాలనీలో వర్షం నీరు ప్రవేశించింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇల్లు నీటమునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటితో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నీటిలో కొట్టుకుపోయింది. దీంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతితో కేబుల్ వైర్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement