Friday, May 17, 2024

Breaking | నర్సంపేటలో రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే పెద్ది సతీమణి స్వప్న సేఫ్

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ కేంద్రానికి చెందిన పాత్ ఫైండర్ పాఠశాలకు చెందిన బస్సు కమల పురం నుండి నారక్క పేట కు వెళ్ళే క్రమంలో బస్సును ఫార్చ్యూనర్ వాహనం బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పిల్లలు గాయపడగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనంలో ఎమ్మెల్యే సతీమణి పెద్ది స్వప్న ఉన్నారు, అమె గాయపడగా వరంగల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం..

టైటిల్:అందరూ క్షేమమే…ఆందోళన పడవద్దు…- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

మల్లంపల్లి రోడ్డు కమలాపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎమ్మెల్యే సతీమణి పెద్ది స్వప్న,గాయపడిన విద్యార్థులు అందరూ క్షేమంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.తన పర్యవేక్షణలోనే వరంగల్ అజరా హాస్పిటల్ నందు విద్యార్థులను అడ్మిట్ చేయించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు..అందరూ క్షేమంగానే ఉన్నారు అని,ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పెద్ది ఈ సందర్భంగా తెలియచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement