Thursday, May 2, 2024

Re-schedule | ఒకరోజు ముందే భార‌త్-పాక్ మ్యాచ్..

ఈ ఏడాది భారత్‌ వేదికగా అక్టోబర్ నుండి వన్డే ప్రపంచకప్ జ‌ర‌గ‌నుండ‌గా.. ఈ వ‌రల్డ్ క‌ప్ టోర్నీలో పొటీ ప‌డ‌నున్న భార‌త్-పాక్ మధ్య జ‌రిగే మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ దాయుద‌ల పోరు రీ-షెడ్యూల్ అయింది.

భద్రతా కారణాల రీత్యా అక్టోబరు 15న జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్ 14న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. అయితే, వేదికలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన విధంగానే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. మరో ఎనిమిది మ్యాచ్‌లను కూడా రీషెడ్యూల్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement