Monday, April 29, 2024

డెంటల్‌ సీట్ల భర్తీకి 17 వరకు దరఖాస్తులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: పీజీ దంత వైద్యశాల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పీజీ దంత సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయనున్నారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌ ఎండీఎస్‌-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.

ఈనెల 12న ఉదయం 8 నుంచి 17న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుంది. మెరిట్‌ జాబితా విడుదల అనంతరం వెబ్‌ ఆప్షన్ల నమోదుకు యూనివర్సిటీ మరో ప్రకటన జారీచేస్తుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement