Thursday, May 9, 2024

రామప్ప ఆలయంలో ఏపీ స్పీకర్ త‌మ్మినేని

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా స్పీకర్‌ తమ్మినేని సీతారాం ములుగు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని ఆయ‌న‌ దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏపీ స్పీకర్‌కు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్పీకర్‌ దంపతులను శాలువా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement