Monday, May 6, 2024

న‌దిలో స్నానానికి వెళ్లిన యువ‌కుడు గ‌ల్లంతు

న‌దిలో స్నానం చేసేందుకు వెళ్లిన యువ‌కుడు గ‌ల్లంతైన ఘ‌ట‌న ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. గోదావరి నదిలో ఆ యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో జ‌రిగింది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు హోలీ సంబురాలు చేసుకున్న అనంతరం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నదీ ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement