Wednesday, April 24, 2024

ఈ నెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ

యాదాద్రిలో ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. సంప్రోక్షణ తర్వాత లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు అనుమతించన్నారు. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర పాల్గొననున్నారు. ఈనెల 21 నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం చేయనున్నారు. 108 పారాయణదారులు, ఆలయ అర్చక బృందంతో పంచకుండాత్మక యాగం జరగనుంది. 21 నుంచి 28 వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేయనున్నారు. 28న సంప్రోక్షణ తర్వాత శోభాయాత్రగా ప్రధానాలయంలోకి ఉత్సవమూర్తులను తరలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement