Sunday, April 28, 2024

ధ‌నిక‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు : బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి

నర్సంపేట : నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం సూరిపల్లి, నాగారం గ్రామాలలో ప్రజా గోస.. బిజెపి భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరిగాయి. ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నెరవేర్చలేని హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి బిజెపి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. నాడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో లక్షల కోట్ల అప్పులమయంగా మారిందన్నారు. కుటుంబ పాలనతో నియంత పోకడలతో తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. సొంత రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఆపలేని కేసీఆర్ ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement