Tuesday, May 7, 2024

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ కు క‌రోనా..

వ‌రంగ‌ల్ – రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత నాలుగు రోజులుగా జ్వరం, ఒంటి నొప్పులతో బాధ పడుతున్న మంత్రి కోవిడ్ పరీక్షలు చేసుకోగా నేడు దాని ఫలితం పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆమె హాస్ప‌ట‌ల్ చేరి చికిత్స పొందుతున్నారు… ఈ నేప‌థ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేసుకోవాల‌ని మంత్రి కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement