Saturday, May 18, 2024

ఎమ్మెల్సీ ఓటు వినియోగం పై అవగాహన కరపత్రాలు పంపిణీ..

తొర్రూరు టౌన్, ఆదివారం రోజున జరగనున్న ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఓటు వినియోగం పై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కరపత్రాన్ని అందజేస్తున్నట్లు తాసిల్దార్ వేమిరెడ్డి రాఘవ రెడ్డి తెలిపారు ఆదివారం ఉదయం 8.00గం. నుండి సాయంత్రం 4.00గం. ల వరకు. తొర్రూర్ మండలంలో 07 పోలింగ్ కేంద్రాలలో 4606 పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారనీ. ఇప్పటికే బి.ఎల్ ఓ ల ద్వారా ఓటర్ స్లిప్ ల పంపిణీ చేయటం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయ‌ని,. రేపు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు అక్క‌డికి చేరుకుంటారన్నారు. ఈ ఎన్నికల లో ఓటు ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటు వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement