Tuesday, April 30, 2024

Warangal – కారు ఢీ – కార్పొరేషన్ ఉద్యోగి మృతి

కార్పొరేషన్ ఏప్రిల్ 26 (ప్రభ న్యూస్): వరంగల్ మహానగరపాలక సంస్థలో జవాన్ గా పనిచేస్తున్న కొమ్ము దేవయ్య శుక్రవారం తెల్లవారుజామున డ్యూటీలో ఉండగా ఒక గుర్తుతెలియనీ కారు వచ్చి డీ కొట్టడంతో అక్కడికక్కడేమృతి చెందాడు

బల్దియాలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తూ ఉన్న జవాన్ కు ఒక కుమారుడు కూతురు ఉన్నారు .కాజీపేట ప్రాంతానికి చెంది జవాన్ కొమ్ము దేవయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వారి స్థానంలో వారి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు పుల్లా రమేష్ కోరారు.

జవాన్ దేవయ్య మృతి చెందిన ఘటన తెలుసుకుని సిఎంఎచ్ ఓ డాక్టర్ రాజేష్ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.యూనియన్ నాయకులు, సానిటరీ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement