Tuesday, May 7, 2024

HYD : యాకత్పురా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు ఓటు వేసి గెలిపించండి… సామా సుందర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 15 (ప్రభ న్యూస్) యాకత్పురా నియోజకవర్గ అభివృద్ధి కోసం బి ఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామా సుందర్ రెడ్డి కోరారు. నియోజకవర్గ పరిధిలోని ప్రెస్ కాలనీ ,ఆర్టిసి కాలనీ ఇతర కాలనీలో సామ సుందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న బి ఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. గత తొమ్మిది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement