Monday, April 29, 2024

ఆయనకు ఓటమి భయం.. అందుకే పీకే జపం: మాజీ ఎంపీ వివేక్

బిజేపి ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సియం కేసిఆర్ కు ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని అన్నారు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపి వివేక్… ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చేల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, టిటిడి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్సన అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో ప్రజలు మంచి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, బిజేపి గెలుపు ఖాయమైందన్నారు. అందుకే కేసిఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసిఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నారంటే కేసిఆర్ ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతి, నియంతృత్వ కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్న వివేక్.. తెలంగాణలో వరుస ఎన్నికలలో బిజేపికే ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement