Friday, April 19, 2024

Flash: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం కండ్రిక దగ్గర ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి పలువురిని కాపాడారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు బళ్లారి నుంచి నెల్లూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement