Saturday, May 18, 2024

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్‌రాజ్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ వికాస్‌రాజ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని బుద్దభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలను స్వీకరించారు. 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ప్రమోద్‌ కుమార్‌శర్మ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న శశాంక్‌గోయల్‌ కేంద్ర సర్వసుల్లోకి డిప్యూటేషన్‌పై వెళ్లారు. దాంతో ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జి ఎన్నికల ప్రధాన అధికారిగా అడిషనల్‌ సీఈవో బుద్దప్రకాష్‌ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఐఏఎస్‌ వికాస్‌రాజ్‌ను నియమించింది. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై వికాస్‌రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వికాస్‌రాజ్‌కు అసెంబ్లిd కార్యదర్శి డా. నరసింహాచార్యులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం బుద్దభవన్‌లో వికాస్‌రాజ్‌ను మర్యాపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement