Sunday, April 28, 2024

రాజన్నకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి: రాములమ్మ

వేములవాడ రాజన్నకి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. దేవుడికి కూడా అబద్ధాలు చెప్పిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఏడాదికి వంద కోట్ల రూపాయలు ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఏడేండ్లకు రూ.700 కోట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న విజయశాంతి.. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీపై బీజేపీ చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. . సీఎం కేసీఆర్ దేవుడికి కూడా అబద్ధం చెప్పారని అన్నారు. ఆ శివుడు ఊరుకోడని, మూడో కన్ను తెరుస్తాడని హెచ్చరించారు. ఆలయ అభివృద్ధికి తక్షణం నిధులు కేటాయించాలన్న రాములమ్మ.. వేములవాడలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా మంత్రి ఉండి కూడా ప్రయోజనం లేదని వియశాంతి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement