Friday, May 3, 2024

Vemulawada – రాజన్న సేవ‌లో మంత్రి పొన్నం – కోడే మొక్క‌లు చెల్లింపు

వేముల‌వాడ – సుప్రసద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయానికి వచ్చిన మంత్రి కి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామికి ముక్కులు చెల్లించడంతోపాటు కోడె ముక్కులను కుటుంబ సభ్యులతో కలిసి చెల్లించారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి పూర్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement