Saturday, May 4, 2024

భట్టి పాదయాత్రకు పలువురి సంఘీభావం

యాదాద్రి – సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మాసాయిపేటలో కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు, మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య లు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. విక్రమార్కతో కలిసి వారు పాదయాత్రలో పాల్గొన్నారు. రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో జరిగిన పాదయాత్ర కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుడుదుల నగేష్, కల్లూరి రామచంద్రా రెడ్డి, బండ్రు శోభారాణి, బోళ్ల కొండల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, శ్రీశైలం, బుడిగే పెంటయ్య, మహేందర్ గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.–

Advertisement

తాజా వార్తలు

Advertisement