Tuesday, May 14, 2024

వ్యాక్సిన్ తోనే ప్రతి ఒక్కరికీ రక్షణ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

వ్యాక్సిన్ తోనే ప్ర‌తి ఒక్క‌రికీ ర‌క్ష‌ణ ఉంటుంద‌ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని హెచ్ఎంటిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీనేజర్లకు వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా 15 నుండి 18 ఏళ్లలోపు పిల్లలందరికీ వేయించాలని ఎమ్మెల్యే సూచించారు. కళాశాలలోని ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థినీ, విద్యార్థులు సుమారు 400 మంది ఉండటంతో అందరికీ సరిపడా వాక్సిన్ ను అందుబాటులో ఉంచుకొని వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తను కూడా రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని గుర్తుచేశారు. కరోనా కేసులు ఇటీవలే మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ, ప్రభుత్వ సూచనల మేరకు పిల్లలందరూ వాక్సిన్ వేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ మనకి రక్షణ కవచంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి, కోఆర్డినేటర్ నారాయణ రావు, వైద్య మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement