Monday, April 29, 2024

TS | ఎస్సీ కులాల అభ్యున్నతి.. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొప్పుల

ఎస్సి కులాల అభ్యున్నతి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ప్రతినిదుల బృందం శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఈశ్వర్ ను కలిశారు. రాష్ట్రంలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. తమ సమస్యల పై ఎస్సి డెవలప్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జకు , మంత్రి కొప్పుల సమక్షంలో వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతనే ఎస్సి కులాలు, వర్గాల ప్రజలకు మేలు జరిగింద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పధకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పధకాలు ప్రవేశ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement