Thursday, May 2, 2024

రేగొండ PHCని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ముందుగా రేగొండ మండలంకు చేరుకున్న కిషన్ రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డితో కలిసి మండలంలోని రూపిరెడ్డిపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఉత్తమ సేవలకు కేంద్ర అవార్డు అందుకున్న రేగొండ పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని  విభాగాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి వైద్యులు, సిబ్బందిని సేవలను అభినందించారు. అక్కడి నుండి నేరుగా  పాండవులగుట్టను సందర్శించారు. అక్కడి నుండి గణపురం మండలం చెల్పూర్  శివారులోని టీఎస్ జెన్కో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, డిఎంహెచ్ఓ శ్రీరామ్, బిజెపి నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement