Thursday, May 16, 2024

కారు ఢీకొని ఇద్ద‌రు మృతి

కారు ఢీకొని ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.2లో రోహిత్‌ అనే వ్యక్తి అర్ధ‌రాత్రి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్‌, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే త్రిభువన్‌రాయ్‌ రెయిన్‌బో ఆసుపత్రిలో ఆఫీస్‌బాయ్ గా పనిచేస్తుండగా, ఉపేందర్‌ కుమార్‌ దాస్‌ అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement