Thursday, May 2, 2024

జెస్ట్ అయిదు నిమిషాలే… రెండు భారీ భ‌వ‌నాలు మాయం …

హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను ఆధునిక సాంకేతిక విధనాలతో కేవలం ఐదు నిమిషాల్లోనే కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఏడు, ఎనిమిది బ్లాక్‌లలో నాలుగు అంతస్తుల భవనాలు రెండు వేర్వేరుగా ఉన్నాయి. ఈ భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడం కోసం రెండింటినీ కూల్చివేశారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెండు భవనాలను నిమిషాల్లోనే కూల్చేశారు. పక్కన ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ భవనాలను పేకమేడల్లా కూల్చేశారు. వెంట‌నే ఆ శిధిలాల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement