Tuesday, April 30, 2024

వాటిని కూడా దొంగ‌త‌నం చేస్తారా….!!!

ఎల్బీనగర్ సెప్టెంబర్ 23 (ప్రభ న్యూస్). గణేష్ మండపం వద్ద లడ్డు దొంగతనానికి యత్నించిన ఇద్దరు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.ఇన్స్పెక్టర్ దేప జలంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పిఎస్ పరిధిలోని మన్సురాబాద్ రాఘవేంద్ర కాలనీ లో ప్రతిష్టించిన గణేష్ మండపంలో శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఒక యాక్టివా వాహనం పై వ‌చ్చి లడ్డు దొంగలించేందుకు య‌త్నించారు. .

అదే సమయంలో అక్కడ కాపలాగా ఉన్న వ్యక్తి (చందు) మెలకువగా ఉండి వారిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు.. దీంతో వారు అక్కడి నుండి పారిపోయారు. దీనిపై కావేరి పృథ్వీరాజ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేసి జి అజయ్ బి మహేష్ లను మన్సూరాబాద్ లోని సప్తగిరి కాలనీలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ బాలురును కూడా గుర్తించినట్లు తెలిపారు. కాగా, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు రాత్రి సమయంలో కచ్చితంగా ఇద్దరు వ్యక్తులు మండపంలో కాపలాగా ఉండాలని ఇన్ స్పెక్ట‌ర్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయల సంఘటనలు జరగకుండా సహృదయభావంతో పండుగ జరుపుకోవాలని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement