Tuesday, May 21, 2024

Delhi | ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి.. రాష్ట్రపతి కార్యాలయానికి తెలుగు శక్తి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  ఆంధ్రప్రదేశ్ లో ఆర్టికల్ 356ని  ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేశారు. న్యూఢిల్లీ వచ్చిన ఆయన ఈమేరకు శనివారం రాష్ట్రపతి కార్యాలయంలో,  ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ కార్యాలయాల్లో లేఖలు అందజేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని లేఖలో పేర్కొన్నారు. అనంతరం బి.వి.రామ్ ఆంధ్రప్రదేశ్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వంటి యోధుల స్ఫూర్తితో తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement