Monday, April 29, 2024

Mahabubabad: రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని కోట్య నాయక్ తండా వద్ద రెండు బైకులు ఢీకొని ముత్తితండా గ్రామానికి చెందిన దారావత్ పుమ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ముత్తి తండా ధారావత్ పుమ్య గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు ముత్తి తండా గ్రామం నుండి పని నిమిత్తం పోచారం వైపు వెళ్తుండగా కోట్య నాయక్ తండా మూలమలుపు వద్ద పోచారం గ్రామానికి వెంకటేష్ అనే వ్యక్తి బైకు ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. దీంతో పుమ్య తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement