Saturday, May 4, 2024

తెలంగాణ‌లో అరిజోన్ ఫార్మా పెట్టుబ‌డులు …హ‌ర్షం వ్య‌క్తం చేసిన కెటిఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. ఆరిజెన్ ఫార్మా సంస్థ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో నేడు జ‌రిగిన స‌మావేశం అనంత‌రం ఆరిజెన్ ఫార్మా సంస్థ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఈ ఫార్మా సంస్థ‌ జీనోమ్ వ్యాలీలో 40 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంది. 250 మందికి పైగా ఉపాధి క‌ల్పించ‌నుంది. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో బ‌యో మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయ‌నుంది. ఆరిజెన్ ఫార్మా సంస్థ నిర్ణ‌యంపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement