Saturday, May 4, 2024

సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన TSPSC సెక్ర‌ట‌రీ

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఈరోజు ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనితా రామచంద్రన్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. మార్చి 31న అనిత రామచంద్రన్ కి సిట్ నోటీసులిచ్చింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం నడుస్తున్న నేపథ్యంలోనే.. అనితా రామచంద్రన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement