Friday, April 26, 2024

టి ఎస్ పిఎస్సీ పేప‌ర్ లీక్ – మ‌రోక‌రు అరెస్ట్

హైద‌రాబాద్/మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో మరొకరిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరింది.. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ ఉపాధి హామీ విభాగంలో పని చేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్‌ అరెస్టు చేసింది. పేపర్ కొనుగోలు చేసి అతడు పరీక్ష రాసినట్లు గుర్తించారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. రాజశేఖర్ రెడ్డికి బావ అయిన ప్రశాంత్ గ్రూప్ వన్ పరీక్ష రాసి 100కు పైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది. దీంతో న‌వాబ్ పేట వెళ్లి అత‌డిని అరెస్ట్ చేసి హైద‌రాబాద్ కు తీసుకువ‌చ్చారు సిట్ అధికారులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement