Thursday, April 25, 2024

TS: స‌జ్జ‌నార్.. మ‌రో కీల‌క నిర్ణ‌యం..

స‌మర్థవంతమైన పోలీసు అధికారిగా వీసీ సజ్జనార్ కు ఎంతో పేరుంది. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అప్ప‌టి నుంచి పలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు స‌జ్జ‌నార్‌. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాలింతలు బస్టాండ్ లలో పసిపిల్లలకు పాలిచ్చేందుకు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారి ఇబ్బందికి ముగింపు పలికేందుకు నిర్ణయించారు. బాలింతలు పాలిచ్చేందుకు బస్టాండ్లలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలను తొలుత హైదరాబాదులోని ఎంజీబీఎస్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ లలో వీటిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement