Tuesday, May 21, 2024

Breking: హుజురాబాద్ 4వ రౌండ్ పూర్తి.. లీడ్ లో కొనసాగుతున్న ఈటల

కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ఆర్ కాలేజీలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం అధికారులు రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తి చేయనున్నారు.

హుజురాబాద్ బై పోల్ మొదటి మూడు రౌండ్ లలో బిజేపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక నాలుగో రౌండ్ లో కూడా బిజేపి అభ్యర్ధి ఈటెల 13,525 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, అధికార పార్టీకి 12,262 ఓట్లు, కాంగ్రెస్ 339 ఓట్లతో వెనుకంజలో ఉన్నాయి. మరి కాసేపట్లో అయిదవ రౌండ్ ఫలితాలు విడుదల కానున్నాయి. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 2968 ఓట్ల లీడ్ లోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement