Wednesday, May 1, 2024

TS – ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహ‌న్

హైదరాబాద్ – సినీరంగంలో ఉర్రూతలూగించిన సీనియర్ నటుడు రాజకీయంగా అత్యంత ఉన్నత స్థాయిలో పదవులను అధిష్టించిన బాబూ మోహన్ మరో చరిత్ర సృష్టించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ సమక్షంలో సోమవారం హైదరాబాద్లో ఆ పార్టీలో చేరారు. టీడీపీలో సైకిల్ పై చక్కర్లు కొట్టి… టీఆర్ఎస్ కారులో జోరుగా హుషారుగా సాగిపోయి…కడకు కాషాయ జెండా చేబూని కమల నాథుడైన బాబు మోహన్ బీజేపీ టిక్కెట్టు లభించక . ఆ అధిష్టానం గుర్తింపు దూరమై చివరికి తన చేతిలోని కమలం రేకులు వాడిపోయినట్టు గ్రహించి.. దైవదూత కేఏ పాల్ ప్రజాశాంతి గూటికి చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement