Sunday, April 28, 2024

TS : విద్యుత్ షాక్ తో రైతు మృతి

నిజాంపేట,మార్చి 17(ప్రభన్యూస్) కరెంట్ షాక్ తో యువ రైతు మృతి చెందిన సంఘటననిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బక్కోళ్ల మల్లయ్య (44) వ్యవసాయ పొలం వద్ద రాత్రి వీచిన ఈదురు గాలులకు 11 కెవి విద్యుత్ వైర్ తెగి అతని వ్యవసాయ పొలం వద్ద ఉన్నటువంటి సోలార్ కేబుల్ పై 11 కెవి వైర్ పడి ఉండడంతో వైరును గమనించకపోవడంతో వైరు తగిలి కరెంటు షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతునికి భార్య ఎల్లవ్వ ఒక కూతురు కుమారుడు ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే మల్లయ్య మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement