Monday, May 20, 2024

TS: ఎంపీ టికెట్ అమ్ముకున్న పొన్నం… రాణి రుద్రమ

.. బూడిద కాంట్రాక్టర్ ను బెదిరించి రూ. 2 కోట్లు
… కాంగ్రెస్ అంటేనే స్కాములు
.. సంచలన ఆరోపణలు చేసిన రాణి రుద్రమ
ఆంధ్రప్రభ, కరీంనగర్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద అవినీతిపరుడని, కరీంనగర్ ఎంపీ టికెట్ ను వెలిశాల రాజేందర్రావుకు అమ్ముకున్నారని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి రాని రుద్రమదేవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ లు సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతిపరుడని, ఓ ట్రావెల్స్ అధినేత నుండి రూ.కోటిన్నర విలువైన కారును తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ బూడిద నుండి లంచాలు తీసుకున్న ఘనత పొన్నం ప్రభాకర్ దని, బూడిద తీసుకెళ్లే లారీలను ఆపేసి కాంట్రాక్టర్ ను బెదిరించి తొలుత రూ.2 కోట్లు వసూలు చేశారని, ఆ డబ్బులు సరిపోలేదని మరో 6 కోట్లు వసూలు చేసింది నిజం కాదా అన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంట్రాక్టర్ ను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అని 2జీ, సహారా, బొగ్గు, ఈఎస్ఐ స్కాంలతో దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చివరకు బూడిదను కూడా వదలకుండా స్కాం చేస్తున్నారంటే కాంగ్రెస్ నేతలు ఎంతగా దిగజారారో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని కొంతమంది కాంగ్రెస్ నేతల వద్ద డబ్బులు వసూలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మేస్సార్ మనవడు రోహిత్ కు టిక్కెట్ ఇప్పిస్తానంటూ రూ.10 కోట్ల దాకా ఖర్చు పెట్టించారని ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ ఇచ్చినందుకు వెలిచాల రాజేందర్ వద్ద కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేశారన్నారు. గ్రానైట్ లీజు పేరుతో క్వారీ యజమానులకు లాభం రాకుండా కుటుంబ సభ్యులకు దోచి పెట్టారన్నారు. మంత్రి పొన్నం అవినీతి ఆరోపణలు, వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారన్నారు. చివరకు నాటి మంత్రి గంగులతో లాలూచీ పడ్డారని, గంగుల వద్ద రూ.5 కోట్లు తీసుకుని హుస్నాబాద్ కు పారిపోయారన్నారు. ఎన్ఎస్ యూఐ నాయకుడిగా ఉంటూ ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు సాగిలపడి డబ్బులు దండుకుని విద్యార్థి ఉద్యమాలను నీరుగార్చిన చరిత్ర పొన్నం ది అన్నారు.

అవినీతి మరకలన్నీ అంటించుకుని అవినీతికి పాల్పడుతూ, ప్రక్రుతి సంపదను దోచుకుని క్విడ్ ప్రో క్రో చేస్తున్న మీరా బండి సంజయ్ గురించి మాట్లాడేదని, మే 13న జరిగే ఎన్నికలు ప్రజలందరూ కమలం గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలని జూన్ 4న మంత్రి పొన్నం కు తగిన గుణపాఠం దక్కుతుందన్నారు. బీజేపీ వార్ వన్ సైడ్ అని నార్త్ లో క్లీన్ స్వీప్ చేయబోతొందన్నారు. సౌత్ లోనూ మెజారిటీ స్థానాలు గెలవడం తథ్యమని, బీజేపీకి భయపడే అమేథి నుండి కేరళలోని వయనాడ్ కు రాహుల్ గాంధీ పారిపోయారన్నారు. రిజర్వేషన్లపై ఫేక్ వీడియోలు స్రుష్టించి ప్రజల్లో గందరగోళం స్రుష్టిస్తున్న నీచమైన పార్టీ కాంగ్రెస్ అని, అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఆయన పార్ధివ దేహాన్ని కూడా ఢిల్లీలో ఉంచుకుండా తరలించారన్నారు.

- Advertisement -

బీజేపీ బంపర్ మెజారిటీతో అత్యధిక సీట్లు గెల్చుకోవడం తథ్యమని అన్ని సర్వేలు తేల్చడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. 54 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచిందన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు 18 వేల గ్రామాలకు కరెంట్ సహా కనీస సౌకర్యాల్లేక చీకట్లోనే మగ్గుతున్నా పట్టించుకోలేదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఆయా గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించడంతోపాటు అభివృద్ధి పనులతో అక్కడి ప్రజల ముఖాల్లో వెలుగులు నింపారన్నారు. బ్యాంకు మెట్లు ఎక్కని 4 కోట్ల మంది పేదలకు జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి సంక్షేమ ఫలాల నగదును నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసిన చరిత్ర మోడీదే అన్నారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి, పోరాటాలపై సమగ్ర వివరాలతో బుక్ లెట్ రూపంలో ప్రజల ముందుంచామని, దమ్ముంటే వాటిపై మాట్లాడండన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement