Sunday, April 28, 2024

కేసీఆర్ చెప్పిందే శిలా శాసనం: మంత్రి గంగుల

తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీఆరెస్ పార్టీకి మాత్రమే ఉందని, అది ప్రజల అందరికి తెలుసు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆరెస్ అని గుర్తుచేశారు. పార్టీ బలోపేతన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మొదటిసారి జిల్లా అధ్యక్షులను నియమించారన్న గంగులా.. కేసీఆర్ కు కరీంనగర్ మీద ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అందుకే భారీగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి జి.వి.రామకృష్ణ రావును అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారన్నారు. 2018 ఎన్నికల కంటే 2023లో అంతకంటే ఎక్కువ ఫలితాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నామన్నారు.

సీఎం కేసీఆర్ చెప్పిందే తమకు శిలా శాసనం అని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. అయితే, పార్టీ లైన్ దాటితే వారిని విశ్వసించదని స్పష్టం చేశారు. టీఆరెస్ పార్టీ ఎన్నిక కోసం మేము అందరం కృషి చేస్తామని గంగుల చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement