Thursday, May 2, 2024

భూపాలపల్లిలో ఘనంగా TRS ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు.  భూపాలపల్లిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డితో కలిసి భూపాలపల్లి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సాధనకై సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అనంతరం ఎన్నో సాధించుకున్నామని అందులో ముఖ్యమైనది కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పేర్కొన్నారు. రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీఆర్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన టీఆర్​ఎస్. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బలమైన రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement