Sunday, April 28, 2024

KTR: ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికే టీఆర్ఎస్

టీఆర్‌ఎస్‌ పార్టీ 21వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మన నాయకుడు కేసీఆర్‌ రెండు దశాబ్దాల క్రితం టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. ఉద్యమం నుంచి పాలన వరకు ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలో భాగస్వామ్యమవడం గొప్పవిషయం అని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు.. ఆ తర్వాత స్వాగతోపన్యాసం, పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఉంటుంది. ప్లనరీలో రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేల మంది పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement