Sunday, May 5, 2024

టీపీసీసీ చీఫ్ రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల మూడుచింతలపల్లిలో దీక్ష చేపట్టిన రేవంత్‌రెడ్డి మంత్రి మల్లారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు అసభ్య పదజాలంతో దూషించారని మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు కొండల్‌ ముదిరాజ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement