Thursday, May 2, 2024

టీఆర్ఎస్ తోనే అభివృద్ధి: హుజురాబాద్ లో ఇంటింటా ప్రచారం

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా వినోద్ కుమార్ శనివారం హుజురాబాద్ పట్టణంలో 2, 17వ వార్డులలో ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా వినోద్ కుమార్ ప్రజలకు వివరించారు. హుజురాబాద్ – జమ్మికుంట పట్టణాలను కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ రెండు పట్టణాల బైపాస్ రోడ్డు మధ్య నుంచి వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: టీడీపీ నేత పట్టాబికి బెయిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement