Monday, April 29, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాత మధు నామినేషన్

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ తరుపున తాత మధు నామినేషన్ వేశారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తాత మధు వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, బానోత్ హరిప్రియ, లావుడియా రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement