Wednesday, May 1, 2024

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలి: రేవంత్

కాంగ్రెస్ పార్టీ గుర్తులో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నాయకులను రాళ్లతో కొట్టాలన్నారు. తమ పార్టీని వదిలి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యేంత వరకు పోరాడతామని చెప్పారు. ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుబోయారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీ జెండా సిద్ధం.. నిరాడంబరంగానే పార్టీ ఆవిర్భావం!

Advertisement

తాజా వార్తలు

Advertisement