Monday, April 29, 2024

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ – మ‌రో న‌లుగురి అరెస్ట్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. పేపర్‌ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. ఏఈఈ పేపర్‌ కూడా లీక్‌ కావడంతో, ఈ కేసులో తాజాగా మ‌రో నలుగురిని సిట్ అరెస్టు చేసింది..ఈ న‌లుగురు ప్రధాన నిందితుడు ప్రవీణ్ ను ఎఈఈ పేప‌ర్ కొనుగోలు చేసిన‌ట్లు సిట్ గుర్తించింది.. దీంతో ఈ న‌లుగుర్ని అరెస్ట్ చేశారు..కాగా ఏఈఈ పరీక్ష పేపర్‌ను ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ లీక్‌ చేసి ఒక్కో పేపర్‌ను రూ.10 లక్షలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. చాలా మందికి ఏఈఈ పేపర్‌ను ప్రవీణ్‌ అమ్మాడని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈకేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా, తాజా ఇప్పటి వరకు 27 మంది అరెస్టు అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement